మధిర ఎంపీడీవో వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. వార్డుల రిజర్వేషన్లు మాత్రమే మధిర ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతాయని, ఎంపీటీసీ, సర్పంచుల రిజర్వేషన్లు ఖమ్మం కలెక్టరేట్లో ప్రకటిస్తారని తెలిపారు. త్వరలో అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.