మధిర మండలం రొంపిమల్ల గ్రామంలోని శ్రీ కోదండరామాలయం ఛైర్మన్గా గూడూరు సత్యనారాయణ రెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సమావేశంలో ఆలయ కార్యవర్గ సభ్యులుగా పగిడిపల్లి నాగేశ్వరరావు, తలపరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఓబుల పుల్లారెడ్డి, యానం వెంకటరెడ్డిలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.