ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని ఈనెల 27 న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ గోడ పత్రికలను విడుదల చేశారు.