ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదివారం సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా
కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు.