ముదిగొండ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రి భవనం పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.