ఖమ్మం కలెక్టరేట్ కు ముదిగొండ తహశీల్దార్ సునీత ఎలిజిబెత్ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కూసుమంచి తహశీల్దార్ గా పనిచేసిన రవి కొత్త తహశీల్దార్ గా నియమితులయ్యారు. రెవెన్యూ విభాగంలో జరిగిన ఈ మార్పులపై ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జరుగుతున్న వరుస బదిలీల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నూతన తహశీల్దార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.