చింతకాని మండలం పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం నేత సామినేని రామారావు హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. ఆయన సీపీఎం నేతలు గోపాలరావు, సుదర్శన్ నుంచి వివరాలు సేకరించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, సీపీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.