కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, అధికారంలోకి వచ్చాక గొల్లగూడెంలో రూ. 42.26 కోట్లు, పెదతండాలో రూ. 14 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.