ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం 51 మంది లబ్ధిదారులకు రూ. 16,16,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని తెలిపారు.