కూసుమంచి రైతు వేదికలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సరిత పంట అవశేషాలు తగలబెట్టడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. వ్యవసాయ అధికారి భాస్కర్ నేరుగా వెదజల్లే వరి సాగు, జీవన ఎరువుల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమం రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించబడింది.