వడ్లంటే తెలియని వాళ్లు కల్లాల దగ్గర వడ్లు పట్టుకుని ఫోజులిస్తూ రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం మద్దతు ధర అడిగిన రైతుల చేతులకు బేడీలు వేసి జైల్లో వేసిందని, రుణమాఫీ చేయకుండా ఇబ్బందులకు గురిచేసిందని, సబ్సీడీ పనిముట్ల పథకాలను ఎగబెట్టిందని ఆరోపించారు. నేడు రైతుసభలు పెట్టి జాలి చూపిస్తున్నారని తెలిపారు.