నేలకొండపల్లిలో మంగళవారం వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడిన ఇందుమతి (50) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆమెను కాపాడబోయిన కుమారుడు వెంకటేశ్ కు కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఇందుమతి మృతి చెందగా, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.