
మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్
హైదరాబాద్కు చెందిన మితాలి అగర్వాల్ (కావ్య) మిసెస్ ఇండియా 2025 పోటీలో గ్లోబల్ అంబాసడర్గా ఎంపికయ్యారు. ఆమె సేవ, సహృదయతకు గుర్తింపుగా ‘కాంజెనియాలిటీ’ బిరుదు దక్కింది. ఇంజనీరింగ్ చదివిన ఆమె కమ్యూనికేషన్ లీడర్గా కెరీర్ ప్రారంభించి, EcoMiTz అనే ప్రయోజన కేంద్రిత ప్లాట్ఫామ్ను స్థాపించారు. ప్యాడ్కేర్తో కలిసి ‘రెడ్ రివల్యూషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించి, మెన్స్ట్రువల్ వేస్ట్ను రీసైకిల్ చేస్తూ పర్యావరణ భారాన్ని తగ్గించడం, మహిళల గౌరవాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాజానికి సేవ చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.




