మంగళవారం, తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయిలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, డేటా ఎంట్రీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ఎస్ఆర్ పట్టా విస్తీర్ణం, భూ వివాదాల పరిష్కారం, భూ రికార్డుల నవీకరణ లక్ష్యంగా చేపట్టిన ఈ రీ సర్వేలో ఆధునిక సాంకేతికతతో వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం విధి విధానాలు అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.