ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా పి. శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యతలు చేపట్టిన ఎస్సై శ్రీనివాసరెడ్డికి పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.