ఉప్పొంగుతున్న పాలేరు అలుగు

2చూసినవారు
మొంథా తుఫాను ప్రభావంతో పాలేరు జలాశయం నీటిమట్టం గణనీయంగా పెరిగింది. గరిష్ఠ నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 25 అడుగులకు చేరుకుంది. పరీవాహక ప్రాంతాల నుంచి 37 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

ట్యాగ్స్ :