మణుగూరు మండలంలో శుక్రవారం గోదావరిలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కొండాయిగూడెం శివాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా, పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.