మణుగూరు మండలంలో శనివారం వడదెబ్బతో సింగరేణి కార్మికుడు ఇర్ప నాగేశ్వరరావు మృతి చెందాడు. సుందరయ్య నగర్ కు చెందిన నాగేశ్వరరావు సింగరేణిలో పైపు లైన్ పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. మృతుడి భార్య ఇర్ఫా సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.