పినపాక మండలంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అయితే, ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో యూరియా నమోదు నిలిచిపోయింది. గంటల తరబడి వేచి చూసినా టోకెన్లు రాక రైతులు ఎరువులు లేకుండా వెనుదిరుగుతున్నారు. పంటలకు ఎరువులు వేసే సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సాంకేతిక లోపాలను సరిచేసి, యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.