కల్లూరు మండలంలోని చెన్నూరుకు చెందిన బీటెక్ విద్యార్థి శేషసాయి ప్రేమ్ కుమార్ (22) హైదరాబాద్లో చదువుతుండగా, తన నివాసంలో గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. కొడవటి వెంకటేశ్వరరావు కుమారుడైన యువకుడి ఆకస్మిక మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి.