పెనుబల్లి మండలంలోని నీలాద్రి క్షేత్రంలో శ్రీనీలాద్రిశ్వరస్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రతిష్టాపన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.