మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సత్తుపల్లి మండలంలో 21 పంచాయతీలకు, నామినేషన్ల స్వీకరణ, దాఖలు చేసేందుకు ఏడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. కిష్టారం, రుద్రాక్షపల్లి, రేజర్ల, సిద్ధారం, కిష్టాపురం, గంగారం, బేతుపల్లి క్లస్టర్లలో పంచాయతీలు ఉన్నాయి.