సత్తుపల్లి పట్టణంలో బుధవారం ఎన్సీసీ విద్యార్థులకు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైనవారు వెంటనే 1930కి కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో కేసు నమోదు చేసుకోవాలని సూచించారు. వాట్సప్, టెలిగ్రామ్ లలో అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అపరిచితులకు ఇవ్వవద్దని తెలిపారు.