మహిళా సాధికారత, సంక్షేమానికి
కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో 23 వార్డుల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళలు సమాజంలో గొప్ప శక్తిగా ఎదగాలని, వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.