మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ లోకి చేరికలు ఊపందుకున్నాయి. గురువారం సత్తుపల్లి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్లు మాట్టా ప్రసాద్, వేములపల్లి మధు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు ఆకర్షితులై వీరు పార్టీలో చేరడం శుభపరిణామమని దయానంద్ అన్నారు.