తల్లాడ మండలం మల్లవరం గ్రామం రైతులు ఆదివారం ఊటవాగు రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ రహదారి గుండా నిత్యం వందలాది మంది రైతులు తమ వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. బ్రిడ్జి లేకపోవడం వల్ల పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి, ఊటవాగుపై బ్రిడ్జి నిర్మాణ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.