ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కోరుతూ గంగలూరు నాచారం, రేపల్లెవాడ కాలనీ నాచారం గ్రామాల్లో ఆదివాసులు ర్యాలీ నిర్వహించారు. 'వాడెవడు, వీడెవడు ఆదివాసికి, ఎదురెవ్వడు' అనే నినాదాలతో ఈ మూడు గ్రామాల్లోని ఆదివాసులను ఏకం చేశారు. భద్రాచలంలో జరగబోయే బహిరంగ సభకు వేలాదిమంది ఆదివాసులు తరలిరావాలని, తమ ఆదివాసీ హక్కులను తామే కాపాడుకోవాలని ఏన్కూరు మండలం ఆదివాసీ అధ్యక్షుడు వర్షా నాగరాజు కోరారు.