ఏన్కూరు మండలంలో 141వ మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రధాన సెంటర్లలో జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్ మాట్లాడుతూ,
అమెరికా చికాగోలో జరిగిన కార్మిక పోరాటంలో కార్మికుల త్యాగాల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినాలు, అనేక కార్మిక చట్టాలు సాధించబడ్డాయని, మేడే స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.