కొణిజర్ల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు ధరావత్ నంధ్యా నాయక్ తన ఐదు ఎకరాల పామాయిల్ తోటలో గురువారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని రెండు ఎకరాల తోట దగ్ధమైంది. సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శి కుటుంబరావు స్థానిక రైతులతో కలిసి తోటను పరిశీలించి, బాధిత రైతును పరామర్శించారు. అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.