వైరా రూరల్ మండలంలోని దాచాపురం మీదుగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం సివిల్ సప్లయీస్ ఉద్యోగులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెమలికి బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో ఆర్ఐ కిరణ్ తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా ఆటో, ఎనిమిది క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు ఎస్సై రామారావు తెలిపారు.