ముంబైలో ఆడిషన్స్ పేరుతో పిలిచి 20 మంది పిల్లలను బంధించిన నిందితుడు రోహిత్ ఆర్యను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పిల్లలను రక్షించే క్రమంలో ముంబై పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలపాలైన రోహిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చిన్నారులు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.