TG: ప్రొఫెసర్ కోదండరాం, అజహరుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2023 మే 27న పదవీకాలం పూర్తి చేసుకున్న మాజీ ఎమ్మెల్సీలు డీ రాజేశ్వర్ రావు, ఫరూక్ హుస్సేన్ స్థానంలో వీరిని భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అజహరుద్దీన్ గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేయగా ఈ నెల 30తో MLCగా ఎన్నిక అయ్యే గడువు పూర్తి కానుంది.