ఐపీఎల్ 2026 సీజన్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన అజితేశ్ అర్గల్, ఢిల్లీ క్యాపిటల్స్-ఆర్సీబీ మ్యాచ్లో అంపైర్గా వ్యవహరించాడు. మ్యాచ్ అనంతరం
కోహ్లీ, అజితేశ్ సరదాగా ముచ్చటించుకున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అజితేశ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. క్రికెటర్గా కాకుండా, ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తూనే, క్రికెట్పై ప్రేమతో అంపైర్గా మారాడు. ఈ ఏడాది బీసీసీఐ అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఐపీఎల్లో అంపైరింగ్ అవకాశం దక్కించుకున్నాడు.