బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేశామని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం పట్టణంలోని హనుమాన్ నగర్కి చెందిన 200 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారిని మాజీ జడ్పీ చైర్మన్, పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ రాథోడ్ జనార్ధన్తో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.