ఇద్దరు ఎస్సైలకు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖలో సేవలందించిన ఎస్సైలు మల్లయ్య, శ్రీనివాస్ పదవీ విరమణ పొందారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ వాహీదుద్దీన్ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వారి సేవాకాలంలో క్రమశిక్షణ, నిబద్ధత ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం ఇద్దరు అధికారులను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
