లింగాపూర్ మండలం గూమ్నూరు (బి) గ్రామస్థులు వరకట్నాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలోని 93 కుటుంబాలు కట్నం లేకుండానే వివాహాలు జరపాలని, పెళ్లి వారికి అందరూ ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఆడబిడ్డల భారం తగ్గించి, సమానత్వం పెంచడమే లక్ష్యమని గ్రామ పటేల్ తెలిపారు. ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.