కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 12 హాక్ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయని టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ శనివారం తీవ్రంగా విమర్శించారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించకుండా, యూరియా నిల్వలను కేంద్రాల్లో నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, దీంతో యూరియా బ్లాక్ మార్కెట్లో రూ. 300 నుంచి రూ. 500 వరకు అధిక ధరలకు అమ్ముడు పోతుందన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.