కొమురం భీమ్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతున్న బొట్టుపల్లి సాయి దీక్ష, 43వ సీనియర్ నేషనల్ నెట్బాల్ అసోసియేషన్ చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఈ జాతీయస్థాయి పోటీలు ఈ నెల 11 నుంచి 14 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. సాయి దీక్ష ఎంపికపై కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, నెట్బాల్ జిల్లా అధ్యక్షులు ఆమెను అభినందించారు.