SMAM పథకం కింద సబ్సిడీపై రెబ్బెన మండలానికి మంజూరైన వ్యవసాయ పనిముట్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి దిలీప్ బుధవారం తెలిపారు. SC, ST వర్గాలకు చెందిన రైతులకు 50%, ఇతర వర్గాలకు 40% సబ్సిడీపై పరికరాలు అందజేస్తారు. అవసరం ఉన్న రైతులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.