శనివారం, జన అరణ్యంలోకి అడవిపందుల గుంపు వచ్చి బీభత్సం సృష్టించింది. పంట చేనులో నుంచి రోడ్డు మీదకు వచ్చిన పందుల గుంపును చూసి ప్రజలు కేకలు వేశారు. ఈ క్రమంలో విధులకు వెళ్తున్న ఫారెస్ట్ ఎనిమల్ ట్రాకర్ బోజ్జిరావును ఒక పంది వేగంగా ఢీ కొట్టింది. ఆ పంది పరిగెత్తుకెళ్లి బావిలో పడింది. గాయాలపాలైన బోజ్జిరావును తిర్యాణి ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బావిలో పడిన అడవి పందిని రక్షించడానికి అటవీ శాఖ అధికారులు, సింగరేణి రెస్క్యూ టీం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.