కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్ కాలనీ 3వ వార్డులో ఆదివారం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన ఆవును స్థానికుల సమాచారం మేరకు వార్డు కౌన్సిలర్ అలియా బేగం ముబీన్ వెంటనే స్పందించి, కాలనీ వాసుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టి ఆవును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మూగజీవి ప్రాణాలను కాపాడేందుకు తక్షణమే స్పందించిన కౌన్సిలర్ను స్థానికులు అభినందించారు.