కాగజ్ నగర్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు మరమ్మతులు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం కమీషనర్ ఏలుపుల రాజేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. 1952లో ఏర్పడిన మున్సిపాలిటీ ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధానంగా మాస్టర్ ప్లాన్ లేకపోవడమే కారణమని సీపీఎం పార్టీ పేర్కొంది.