కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన ననుమల రాజన్న శనివారం బీఆర్ఎస్ పార్టీని వీడి, ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎమ్మాజీ శారద సంతోష్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చేరిక కాగజ్నగర్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.