స్థానిక ఎన్నికల నేపథ్యంలో, రూ. 50 వేలకు మించిన నగదును తీసుకెళ్తే, ఆ సొమ్ముతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని అశ్వారావుపేట తహశీల్దార్ రామక్రిష్ణ మంగళవారం తెలిపారు. రూ. 50 వేలకు మించిన సొత్తు ఉంటే, దానిని ఏ అవసరం కోసం తీసుకెళ్తున్నారో సరైన ఆధారాలు చూపాలని ఆయన స్పష్టం చేశారు.