దమ్మపేట గ్రామంలో పుట్టింటికి వచ్చిన భవాని (25) అనే వివాహిత మహిళ అదృశ్యమైంది. పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె, సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అన్ని చోట్లా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భవాని తండ్రి కుప్పాల మోహన్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.