అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, 15వ వార్డులో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి మోర్ల రాజేశ్వరి విజయం కోసం ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సీపీఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.