
రేపు రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ
రాష్ట్రాల ఆర్థికమంత్రులతో రేపు(శనివారం) కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ కీలక భేటీ జరగనుంది. బడ్జెట్ ప్రిపరేషన్పై రాష్ట్రాల విజ్ఞప్తులను నిర్మలా సీతారామన్ స్వీకరించనున్నారు. కాగా ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలిదశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 ఆదివారం రోజున కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.




