
భద్రాద్రిలో పరిశ్రమల మూత: నిరుద్యోగుల ఆందోళన
భద్రాద్రి జిల్లాలో పరిశ్రమలు మూతపడుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జలగం వెంగళరావు హయాంలో ఏర్పాటైన పరిశ్రమలే నేటికీ ఆధారంగా ఉన్నాయి. కొత్త పరిశ్రమల స్థాపన లేకపోవడం, ఉన్న వాటికి ప్రభుత్వ సహకారం కరువవ్వడంతో జిల్లా వెనుకబడింది. ఎస్సీసీఎల్, కేటీపీఎస్ వంటి సంస్థలే దిక్కుగా మారగా, ఉపాధి దొరక్క యువత నగరాల బాట పడుతున్నారు. పారిశ్రామికాభివృద్ధిపై పాలకులు దృష్టి సారించాలని కోరుతున్నారు.



































