భద్రాచలం, గురువారం: స్థానిక నన్నపనేని పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు రహదారి నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎంవీఐఎస్. వెంకటపుల్లయ్య మాట్లాడుతూ, వేగం కంటే ప్రాణం ముఖ్యమని, మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు కేసుల పాలవ్వద్దని హెచ్చరించారు. మోటివేషనల్ స్పీకర్ వెంకటేశ్వరబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.