జిల్లాలోని నియోజకవర్గాలలో నెలకొన్న అటవీ, రెవెన్యూ భూ సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ అటవీ అనుమతులపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన ఐటీడిఏలో బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ అనుమతులు, పోడు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట రావు, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.